AP News: వంగవీటి రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత: చంద్రబాబు

శణ్త‌ణన హత్యకు రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు..

Updated : 29 Dec 2021 15:44 IST

అమరావతి: తన హత్యకు రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు.. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాశారు. రాధాపై జరిగిన రెక్కీ విషయంలో సమగ్ర విచారణ జరిపి.. దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. రాధాకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు.

బెదిరింపులు, గూండారాజ్‌ పరంపరలో భాగంగా రాధాను లక్ష్యంగా చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని ఆక్షేపించారు. హింసాత్మక సంఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. నేరస్థులపై సమగ్ర విచారణ.. కఠినమైన చర్యలే రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాపాడతాయని చంద్రబాబు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు