జగన్‌వి అనాలోచిత నిర్ణయాలు: చినరాజప్ప

పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్‌వి అనాలోచిత నిర్ణయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. దీని వల్ల అధికారులు..

Updated : 21 Jul 2021 11:47 IST

అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్‌వి అనాలోచిత నిర్ణయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. దీని వల్ల అధికారులు బలవుతున్నారని చెప్పారు.‘‘పోలవరం సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయకుండానే గిరిజనులను బలవంతంగా తరలిస్తున్న ప్రక్రియను జాతీయ ఎస్టీ కమిషన్ నిలదీసింది. 18 గ్రామాలకు చెందిన 1,724 నిర్వాసిత గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా రాజకీయ ఒత్తిళ్లతో వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం సహాయ, పునరావాసం చేపట్టాల్సి ఉండగా ఆ వివరాలేవీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్రానికి తెలియనివ్వట్లేదు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల జూన్ నుంచే ముంపు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు" అని చినరాజప్ప ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని