AP News: సీబీఐ విచారణ జరిపించండి: పయ్యావుల కేశవ్‌ 

అధికారం ఉందని దాడులకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని తెదేపా సీనియర్‌ నేత, పీఏసీ ఛైర్మన్‌

Updated : 21 Oct 2021 13:45 IST

అమరావతి: అధికారం ఉందని దాడులకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని తెదేపా సీనియర్‌ నేత, పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ హెచ్చరించారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అమరావతి తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయిపై ప్రశ్నిస్తే దాడులా? అని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి భయపడేది లేదన్నారు.

తెదేపా కార్యాలయంలో అనుమానాస్పద వ్యక్తిని పట్టుకున్నామని.. ఆరా తీస్తే అతడిని డీజీపీ కార్యాలయంలో పీఆర్వోగా గుర్తించామన్నారు. తెదేపా కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో అన్నీ రికార్డయ్యాయని చెప్పారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రదారులు తెలియాలంటే  సీబీఐ విచారణ జరిపించాలన్నారు. డీజీపీ పాత్రపైనా విచారణ జరిపించాలని పయ్యావుల డిమాండ్‌ చేశారు. దాడి ఘటనలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని.. అన్ని విషయాలూ తేలుస్తామన్నారు. కొంతమంది వల్ల పోలీసు వ్యవస్థ అంతర్మథనంతో నలిగిపోయే పరిస్థితి నెలకొందన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు