AP News: సంస్కారం, నాగరికతపై వైకాపా మాట్లాడటం దురదృష్టకరం: కనకమేడల
వైకాపా సంస్కారం లేని పార్టీ అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసి తెదేపాపై ఫిర్యాదు చేయడాన్ని
దిల్లీ: వైకాపా సంస్కారం లేని పార్టీ అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసి తెదేపాపై ఫిర్యాదు చేయడాన్ని తెదేపా ఖండించింది. ఈ మేరకు దిల్లీలో రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత వైకాపా నేతలకు లేదన్నారు. అధికారంలో లేనప్పుడు.. వచ్చిన తర్వాత చంద్రబాబుపై వైకాపా నేతలు మాట్లాడిన మాటలను ఆ పార్టీ ఎంపీలు గుర్తు చేసుకోవాలన్నారు. సంస్కారం, నాగరికత గురించి వైకాపా మాట్లాడటం దురదృష్టకరమని ఆయన చెప్పారు. చట్టాలను గౌరవించని వైకాపా నేతలు చట్టాలు చేయండని రాష్ట్రపతిని కోరడం విడ్డూరమని రవీంద్రకుమార్ అన్నారు. ఏపీలో విష సంస్కృతి నెలకొందని.. వైకాపా తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు.
వైకాపా ప్రభుత్వంలోకి వచ్చాక మంత్రులు ప్రతిపక్ష నాయకుడిపై చేస్తున్న వ్యాఖ్యలను అందరూ గమనిస్తున్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వారిని దూషిస్తే శిక్షించేలా చట్టం తేవాలని రాష్ట్రపతిని వైకాపా నేతలు కోరడాన్ని స్వాగతిస్తున్నానని.. ప్రతిపక్ష నేత పదవి కూడా రాజ్యాంగబద్ధ పదవి అనే విషయం వైకాపా నేతలకు తెలుసా అని ప్రశ్నించారు. పార్టీ కార్యలయాలపై, నివాసాలపై దాడులు చేసి రాష్ట్రపతిని ఏ విధంగా కలిశారని నిలదీశారు. ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లు పూడ్చాలని.. కరెంట్ బిల్లులను తగ్గించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్