ఖాకీ డ్రెస్‌లో సేవ చేయాల్సింది ప్రజలకి.. పార్టీలకు కాదు: రామ్మోహన్‌ నాయుడు

ఏపీలో డ్రగ్స్‌ మాఫియా నడుస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. దీని వెనుక

Updated : 25 Sep 2021 15:57 IST

అమరావతి: ఏపీలో డ్రగ్స్‌ మాఫియా నడుస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో డీజీపీ తేల్చాలని డిమాండ్‌ చేశారు. తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏం అంశంపై అయినా తెదేపా సాక్ష్యాధారాలతో మాట్లాడుతుందని.. ఈ విషయాన్ని డీజీపీ గుర్తుంచుకోవాలన్నారు.

డ్రగ్స్‌ విషయంలో డీజీపీ, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తే ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. ఖాకీ డ్రెస్‌ వేసుకుని ప్రజలకు సేవ చేయాలి కానీ పార్టీలకు కాదని రామ్మోహన్‌ మండిపడ్డారు. హెరాయిన్‌ అంశంలో వే బిల్లులు బయటకు తీయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని