AP Politics: పింఛన్ల తొలగింపుపై ధర్మవరంలో తెదేపా ర్యాలీ.. పోలీసుల అడ్డగింత 

పింఛన్ల తొలగింపును నిరసిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరంలో తెదేపా చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

Updated : 13 Sep 2021 14:47 IST

ధర్మవరం: పింఛన్ల తొలగింపును నిరసిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరంలో తెదేపా చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు పరిటాల శ్రీరామ్‌ పాల్గొన్నారు. నిరసనకు ఆదివారమే పిలుపునిచ్చిన నేపథ్యంలో మండల కేంద్రాల నుంచి వస్తున్న తెదేపా నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గాంధీ నగర్‌ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్నా.. తెదేపా కార్యకర్తలు ముందుకు కదిలారు. అనంతరం పింఛన్ల తొలగింపునకు వ్యతిరేకంగా ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు