AP Politics: దళితుల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: నక్కా ఆనంద్బాబు
ఆంధ్రప్రదేశ్లో ఎవరి హయాంలో దళితుల అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా?అని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో ఎవరి హయాంలో దళితుల అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా?అని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు సవాల్ విసిరారు. విజయవాడలో తెదేపా తలపెట్టిన దళిత ప్రతిఘటన ర్యాలీకి బయల్దేరిన ఆనంద్బాబును గుంటూరులోని నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్లరామయ్యను విజయవాడలో, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను నందిగామలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎస్సీల హక్కులు కాలరాయడమే జగన్ ఎజెండాగా మారిందని మాజీ మంత్రి జవహర్ దుయ్యబట్టారు.
‘‘దళిత ప్రతిఘటన ర్యాలీకి పోలీసులు అనుమతివ్వకపోవడం అప్రజాస్వామికం. వైకాపా రెండేళ్ల పాలనలో ఎస్సీలపైనే ఎక్కువగా దాడులు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లిస్తున్నారు’’ అని ఆనంద్బాబు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?