AP News: డీజీపీ స్పందించకపోవడం పోలీస్‌శాఖ ప్రతిష్ఠకే మాయని మచ్చ: సోమిరెడ్డి

ఏపీ పోలీసు వ్యవస్థపై హైకోర్టు తీవ్రమైన అభిశంసన చేసిందని మాజీ మంత్రి సోమిరెడ్డి స్పష్టం చేశారు.

Updated : 24 Oct 2021 13:39 IST

అమరావతి: ఏపీ పోలీసు వ్యవస్థపై హైకోర్టు తీవ్రమైన అభిశంసన చేసిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. సీఎంకు ఒకటి, హైకోర్టు న్యాయమూర్తులకు మరో చట్టమా అనే ప్రశ్నను లేవనెత్తిందని గుర్తు చేశారు. పోలీస్‌ వ్యవస్థపై హైకోర్టు నమ్మకం కోల్పోయిందని తెలిపారు. ఈ క్రమంలో పోలీసు వ్యవస్థకు విలువేముంటుందన్నారు. తీవ్రమైన అభిశంసనపై కూడా డీజీపీ స్పందించట్లేదని.. ఇది పోలీస్‌శాఖ ప్రతిష్ఠకే మాయని మచ్చ అని ఆక్షేపించారు. డీజీపీ ఆత్మవిమర్శ చేసుకుంటే సముచితంగా ఉంటుందని సోమిరెడ్డి హితవు పలికారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు