TS News: ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉత్కంఠ.. తెరాసకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది...
ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తెరాస తరఫున దండెం విఠల్ నామినేషన్ వేయగా, తుడుందెబ్బ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి నామినేషన్ వేశారు. వీరితో పాటు మరో 22 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
అయితే, నిన్న, ఇవాళ 20 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సంపత్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికల అధికారిని కలిసి పుష్పరాణి నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. నామినేషన్ పత్రంలో ప్రతిపాదించిన పేర్లలో సంపత్ కుమార్ పేరు లేకపోవడంతో అధికారులు అభ్యంతరం తెలిపారు. ఉపసంహరణపై పుష్పరాణితో ఫోన్ చేయించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పుష్పరాణి తన నామినేషన్ ఉప సంహరించుకున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండించిన పుష్పరాణి తాను బరిలో ఉన్నట్టు ప్రకటన విడుదల చేశారు. తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీడియో సందేశం పంపారు. మరోవైపు నామినేషన్ల గడువు ముగియడంతో కలెక్టర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. పుష్పరాణి నామినేషన్ ఉపసంహరణపై దాదాపు 2గంటల పాటు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, బాల్క సుమన్, కోనేరు కోనప్ప, బాపూరావు, జోగు రామన్న, రేఖానాయక్తో పాటు తెరాస రాష్ట్ర, జిల్లా నాయకులు ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కాసేపటికి పుష్పరాణి కూడా కలెక్టరేట్ వద్దకు చేరుకోవడంతో భాజపా శ్రేణులు పుష్పరాణికి మద్దతు తెలిపారు. పుష్పరాణిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు యత్నించడంతో తుడుందెబ్బ, భాజపా శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో భాజపా, తెరాస శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. చివరిరి పుష్పరాణి బరిలో నిలవడంతో ఆదిలాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ అనివార్యమైంది. తెరాస తరఫున దండెం విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పెందూరి పుష్పరాణి బరిలో ఉన్నారు.
ఆదిలాబాద్ నుంచి నేనే ఒకరిని పోటీకి దించా: ఈటల
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో ఆదిలాబాద్ నుంచి తానే ఒకరిని పోటీకి దించానని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. ‘‘ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయి? గెలుస్తామా? ఓడుతామా? అనేది పక్కన పెడితే కనీసం పోటీ చేయాలి. అందుకే ఆదిలాబాద్ నుంచి ఒకరిని బరిలో దించా. తెరాసకు ఏకగ్రీవం అవకాశం ఇవ్వొద్దు. పోటీ చేస్తే కేసీఆర్కు భయమైనా ఉంటుంది. కరీంనగర్లో ఒక స్థానంలో తెరాస ఓడిపోతుంది’’ అని ఈటల రాజేందర్ మీడియాతో అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్