TS News: కిషన్‌రెడ్డి, ఈటల ర్యాలీని అడ్డుకున్న తెరాస.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ  హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. రాజకీయ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో వేడిపుట్టిస్తున్నారు.

Updated : 24 Sep 2022 16:42 IST

ఇల్లందకుంట: పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ  హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. రాజకీయ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో వేడిపుట్టిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఇల్లందకుంట మండలం సిరిసేడులో భాజపా, తెరాస శ్రేణులు ఘర్షణకు దిగారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ర్యాలీని తెరాస శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈక్రమంలో పోలీసు అధికారిపై తెరాస కార్యకర్త ఒకరు చేయిచేసుకున్నారు. భాజపా ర్యాలీని అడ్డుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని