ts politics: ఈటల రాజేందర్‌ పర్యటనలో ఉద్రిక్తత

జిల్లాలోని వీణవంక మండలం వల్బాపూర్‌లో మాజీమంత్రి, ఈటల రాజేందర్‌ సోమవారం పర్యటించారు.  ఈ సందర్భంగా అక్కడ ఉద్రికత్త చోటు చేసుకుంది. రాజేందర్‌

Updated : 12 Oct 2022 15:44 IST

కరీంనగర్‌: జిల్లాలోని వీణవంక మండలం వల్బాపూర్‌లో మాజీమంత్రి, ఈటల రాజేందర్‌ సోమవారం పర్యటించారు.  ఈ సందర్భంగా అక్కడ ఉద్రికత్త చోటు చేసుకుంది. రాజేందర్‌ సమక్షంలో పలువురు కార్యకర్తలు భాజపాలో చేరారు. భాజపాలో చేరుతున్న వారిని స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ బాపిరెడ్డి ఫొటోలు తీశారు. ఇది గమనించిన భాజపా కార్యకర్తలు.. ఫొటోలు ఎందుకు తీశారు..? అంటూ ఏఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. ఆయన సెల్‌ఫోన్‌ లాక్కొని.. చొక్కాపట్టుకుని లాగారు. తోపులాటలో ఏఎస్‌ఐ బాపిరెడ్డి చొక్కా చిరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఏఎస్‌ఐ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా భాజపా శ్రేణులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని