TS News: సంపన్నులకు లాభం చేకూర్చేలా ‘ధరణి’: మహాధర్నాలో కోదండరామ్
తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం నెలకొందని తెజస అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. కొవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని ..
హైదరాబాద్: తెలంగాణలో ఆరోగ్య సంక్షోభం నెలకొందని తెజస అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. కొవిడ్ కారణంగా ఎంతో మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నాచౌక్ వద్ద ఆయన మాట్లాడారు. అంతకముందు ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలో ఉన్న ప్రజలను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు పిలుపిచ్చిన మహాధర్నాను ఇందిరాపార్క్ నుంచి ప్రారంభించారు. ఇందులో కాంగ్రెస్, తెజస, సీపీఎం, సీపీఐ, తెదేపా, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. మహా ధర్నాకు బీఎస్పీ, వైతెపా హాజరుకాలేదు.
‘‘ఉద్యోగాలు లేక తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఇసుక, భూ దందాలు చేస్తోంది. సంపన్నులకు లాభం చేకూర్చేలా ధరణి చట్టం ఉంది. మనం సాధించుకున్న ధర్నా చౌక్ ఇవాళ మన హక్కుల కోసం ఉపయోగపడింది’’ అని కోదండరామ్ అన్నారు. మహాధర్నాలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నాయకులు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు బక్కిన నర్సింహులు, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీలు రాజయ్య, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు