TS News: ఎమ్మెల్యే కుమారుడి అరాచకాలు సీఎంకు తెలియవా?: రేవంత్‌

పాల్వంచలో భార్య, ఇద్దరు పిల్లలకు నిప్పు పెట్టి తానూ ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ ఘటనలో ఆరోపణలు

Published : 07 Jan 2022 01:21 IST

హైదరాబాద్‌: పాల్వంచలో భార్య, ఇద్దరు పిల్లలకు నిప్పు పెట్టి తానూ ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాఘవకు అధికార పార్టీ తెరాస వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. అతని కీచక చేష్టలకు ఓ కుటుంబం బలైందని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి 3 రోజులైనా చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే కుమారుడి అరాచకాలు సీఎం కేసీఆర్‌కు తెలియవా అని రేవంత్ నిలదీశారు. రాఘవ అరాచకాలు సీఎంకు తెలియకపోవడం ఏంటని.. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ప్రజాపోరాటాలపై నిఘాకే పరిమితమైందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ఎమ్మెల్యేలు, వారసులు.. మాఫియాను మించిపోయారని రేవంత్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని