TS Politics: రేవంత్‌.. థర్డ్‌ క్లాస్‌ మాటలు మానుకో: తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

అధికారంలోకి రాలేమని గ్రహించే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు...

Updated : 12 Oct 2022 14:27 IST

హైదరాబాద్‌: అధికారంలోకి రాలేమని గ్రహించే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. తెరాస శాసన సభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డిది మాటలు.. మూటలు.. ముఠాలు చేసే వైఖరని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌పై ఆయన ప్రయోగిస్తున్న పరుష పదజాలంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌ గాంధీలకు లేఖలు రాసినట్లు చెప్పారు. 

ఈ లేఖల తర్వాతైనా రేవంత్‌ పద్ధతి మార్చుకోవాలని.. థర్డ్‌ క్లాస్‌ మాటలు మానుకోవాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు. అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తే ఆధారాలతో బయటపెట్టాలన్నారు. సొంత పార్టీలో ఎవరూ లెక్క చేయడం లేదనే ఆక్రోశంతో రేవంత్‌ అలా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రగతిభవన్‌ నుంచే పాలన చేశారని.. అప్పుడెందుకు బహుజన పేరు పెట్టలేదని నిలదీశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో బహుజన బోర్డులు పెట్టి తెలంగాణలో మాట్లాడాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని