TS News: కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం: కె.కేశవరావు
చట్టసభలను బాయ్కాట్ చేయడం బాధ కలిగించే విషయమే అని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు(కేకే) అన్నారు.
దిల్లీ: చట్టసభలను బాయ్కాట్ చేయడం బాధ కలిగించే విషయమే అని.. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బహిష్కరిస్తున్నామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు(కేకే) అన్నారు. సభలను బాయ్కాట్ చేయాలని ఎవరూ కోరుకోరని.. కానీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిని ఖండిస్తూ సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నామన్నారు. దిల్లీలో కేకే ఆధ్వర్యంలో తెరాస ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
లోక్సభలో 9, రాజ్యసభలో 7మంది బాయ్కాట్ చేస్తున్నామని కేకే తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై తాము ఏడు రోజులుగా నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్సీఐ నిర్లక్ష్యం వహిస్తోంది. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమని చెబుతున్నారు. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుంది. వాతావరణ పరిస్థితుల వల్ల రబీలో రారైస్ రాదు.. ధాన్యం విరిగిపోయి నూకగా మారుతుంది. అందుకే రబీ ధాన్యం బాయిల్డ్రైస్గా మారుస్తాం. కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం’’ అని కేకే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం నామా నాగేశ్వరరరావు మాట్లాడుతూ ‘‘బాయిల్డ్ రైస్ కొంటారో లేదో తెలపకుండా కేంద్ర ప్రభుత్వం డొంక తిరుగుడు సమాధానాలు చెబుతోంది. తెలంగాణ రైతుల బాధను కేంద్రం పట్టించుకోవట్లేదు. భాజపా నేతలు మోసపూరితంగా మాట్లాడుతున్నారు. యాసంగి పంటను కొనుగోలు చేస్తారో లేదో చెప్పడం లేదు. పార్లమెంట్ లోపలా, బయటా నిరసన తెలిపాం. తెలంగాణ రైతులకు న్యాయం జరగట్లేదనే బహిష్కరిస్తున్నాం. ఈ విషయంలో కొంతమంది చిల్లరగా మాట్లాడుతున్నారు’’ అని అన్నారు.
అంతకముందు ధాన్యం కొనుగోళ్ల అంశంలో తెరాస ఎంపీలు లోక్సభ, రాజ్యసభల్లో ఆందోళనలు చేపట్టారు. ఎంపీలు ఇవాళ నల్లచొక్కాలు ధరించి పార్లమెంట్లో నిరసన తెలిపారు. ధాన్యం సేకరణకు సమగ్ర జాతీయ విధానం తేవాలని.. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సభ వెలుపలా ప్లకార్డులతో నిరసన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..