TS News: 6 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తెరాస విజయకేతనం
తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మె్ల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస విజయకేతనం ఎగురవేసింది. 12స్థానాలకు గానూ 6 ఏకగ్రీవం కాగా మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస జయకేతనం ఎగురవేసింది. 12 స్థానాలకు గానూ 6 ఏకగ్రీవం కాగా మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఆరు స్థానాల్లోనూ తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో ఎల్.రమణ, భానుప్రసాద్ విజయం సాధించారు. భానుప్రసాద్కు 584, రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్లో తెరాస అభ్యర్థి దండె విఠల్ గెలుపొందారు. 667 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు.
ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి తాతా మధు గెలుపొందారు. ఇక్కడ తెరాసకు 480, కాంగ్రెస్కు 242, స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు పోలయ్యాయి. 12 ఓట్లను చెల్లనివిగా గుర్తించారు. నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ తెరాస అభ్యర్థికి 917, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన నగేశ్కు 226, లక్ష్మయ్యకు 26, వెంటేశ్వర్లుకు 6, రామ్సింగ్కు 5ఓట్లు పోలయ్యాయి. 50 ఓట్లు చెల్లనివిగా అధికారులు తేల్చారు. మరోవైపు మెదక్లోనూ అధికార పార్టీ అభ్యర్థి యాదవరెడ్డి 524ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ తెరాసకు 762, కాంగ్రెస్ 238, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు పోలయ్యాయి. 12 చెల్లని ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్