Ts Assembly: రేపటి నుంచి అసెంబ్లీ... ఏర్పాట్లపై సభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్ సమీక్ష
రేపట్నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల సన్నద్ధత ఏర్పాట్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన
హైదరాబాద్: రేపట్నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల సన్నద్ధత ఏర్పాట్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్పీకర్, ప్రొటెం ఛైర్మన్ సమావేశమయ్యారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ చీఫ్విప్ వినయ్ భాస్కర్ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో కరోనాను సమర్థంగా అరికట్టేందుకు కృషి చేసిన ప్రభుత్వం, అధికారులకు సభాపతి పోచారం అభినందనలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, నీతి ఆయోగ్ ఛైర్మన్ సైతం ప్రశంసించారని అన్నారు. రేపట్నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరిన ఆయన.. సభ్యులు అడిగే సమాచారాన్ని త్వరగా అందించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపాలని చెప్పారు. సమావేశాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పోచారం సూచించారు. భద్రతా ఏర్పాట్లపై డీజీపీ మహేందర్రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులతో శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్ సమావేశమయ్యారు. సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుశాఖ నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్