ఏపీ వైఖరే కారణం: జగదీశ్‌రెడ్డి

కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. నీటి పంచాయితీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఖరే కారణమని..

Updated : 15 Jul 2021 19:20 IST

హైదరాబాద్‌: కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. నీటి పంచాయితీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఖరే కారణమని పునరుద్ఘాటించారు. ఏపీ ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ స్నేహ హస్తాన్ని ఏపీ వినియోగించుకోవట్లేదన్నారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదని, నీటి వాటా తేల్చాలని తాము కూడా సుప్రీంకోర్టును అడుగుతున్నామని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని జగదీశ్‌రెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని