AP News: అశోక్ గజపతిరాజుపై రెండు సెక్షన్ల కింద కేసులు

కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌ గజపతిరాజుపై విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated : 23 Dec 2021 14:03 IST

నెల్లిమర్ల: కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌ గజపతిరాజుపై విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన నేపథ్యంలో రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు అశోక్‌పై నెల్లిమర్ల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆలయ ధర్మకర్త అశోక్‌పై రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం, ఆస్తి ధ్వంసం, గందరగోళం సృష్టించారని కేసులు నమోదయ్యాయి. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్‌ పాటించలేదని అశోక్‌ నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బంది తీసుకొస్తున్న శిలాఫలకాన్ని నెట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని