Kishan Reddy: కేసీఆర్ రాచరిక పాలన కోరుకుంటున్నారు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు, ఫలితాలు వెలువడిన తర్వాతి రోజు నుంచి సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం, మేధావులు
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాతి రోజు నుంచి సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం, మేధావులు అర్థం చేసుకోవాలని కేంద్రమంత్రి, భాజపా సీనియర్ నేత కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు బానిసలుగా ఉంటూ తనకు జీహుజూర్ అనాలని కేసీఆర్ భావిస్తున్నారని.. ఎవరు ఎదిరించినా, వ్యతిరేకించినా సహించలేకపోతున్నారని ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్రకార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు.
‘‘తనను ప్రశ్నించే వారు ఉండొద్దని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్న భాష దిగజారుడుతనంగా ఉంది. ప్రధాని మోదీ, భాజపాపై అవాస్తవాలతో విషం కక్కుతున్నారు. బెదిరింపులు, రెచ్చగొట్టే విధానాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్రానికి, భాజపాకు ఎవరూ శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే. దేశ సమైక్యత, సమగ్రతను దెబ్బతీసేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అమరుల ఆత్మలు ఘోషించేలా.. భారత సైనికుల స్థైర్యం దెబ్బతినేలా సీఎం మాట్లాడారు. భారత జవాన్ల దాడిలో పాక్ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. తమ స్థావరాల ధ్వంసాన్ని పాక్ ఉగ్రవాదులూ అంగీకరించారు. తండ్రి తర్వాత కుమారుడు పాలించేలా నిజాం తరహాలో రాచరిక పాలన మళ్లీ రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం ఏడేళ్ల పాలనపై కేసీఆర్తో చర్చకు సిద్ధం. సీఎం కేసీఆర్ సవాల్ను కేంద్ర ప్రభుత్వం తరఫున స్వీకరిస్తున్నా. సీనియర్ పాత్రికేయుల సమక్షంలో గన్పార్కు వద్దకు రావాలి’’ అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్