AP News: వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ

తెదేపా నేత వంగవీటి రాధాను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. విజయవాడలోని

Updated : 26 Dec 2021 16:15 IST

విజయవాడ: తెదేపా నేత వంగవీటి రాధాను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. విజయవాడలోని రాధా కార్యాలయంలో వీరిద్దిరూ భేటీ అయ్యారు. అనంతరం వంగవీటి రంగా 33వ వర్ధంతి సందర్భంగా బందరు రోడ్డులోని ఆయన విగ్రహానికి రాధా, వంశీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ వంగవీటి రంగా ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. రంగా వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు వంగవీటి రాధా, వల్లభనేని వంశీ భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని