
Updated : 05 Sep 2021 19:55 IST
Vijaysai Reddy: ఆ రెండూ జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయి: విజయసాయిరెడ్డి
విశాఖపట్నం: విజయనగరం, విశాఖపట్నం రెండూ జంటనగరాలుగా అభివృద్ధి చెందుతాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరిగిన తర్వాత ప్రస్తుత విశాఖ ఎయిర్పోర్టు రక్షణశాఖకు చెందినదే కాబట్టి వారికే అప్పగిస్తామన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టును కలుపుతూ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు విజయసాయి వివరించారు. విశాఖ- భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డు అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. అన్నివిధాలుగా విశాఖ అద్భుత నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
ఇవీ చదవండి
Tags :