Raghurama: ఇది తెలుగువారికి జరిగిన అవమానం!

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి జరిగిన అవమానం భూదేవికి జరిగినట్లే అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Updated : 20 Nov 2021 18:41 IST

దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి జరిగిన అవమానం భూదేవికి జరిగినట్లే అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వివేకా హత్యపై మాట్లాడకుండా పక్కదారి పట్టించడం సరికాదన్నారు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై రఘురామ స్పందించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మీ ఆడవాళ్ల గురించి ఇలా మాట్లాడితే ఏం చేస్తారు?రోజులన్నీ మీవి కావు.. అది గమనించి నడుచుకోవాలి. నందమూరి కుటుంబం ఎంత ఆవేదన పడిందో చూశాం. ఎన్టీఆర్‌ జాతి సంపద, కుటుంబ పెద్దగా భావించాలి. ఇది ఎన్టీఆర్‌ కుటుంబ సమస్య కాదు.. తెలుగు వారికి జరిగిన అవమానం. ఈ ఘటనపై ప్రతిఒక్కరూ స్పందించాలి. మహిళలంతా ఏకమై ముందుకు కదలాలి’ అని పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని