Raghurama: ఇది ప్రజా విజయం: రఘురామ 

మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై  వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆనందం వ్యక్తం చేశారు.

Updated : 22 Nov 2021 13:13 IST

దిల్లీ: మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై  వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రజా విజయమని తెలిపారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లు ఉపసంహరణ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయంపై సాధించిన విజయమని రఘురామ అభివర్ణించారు.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసిన రైతులు, వారికి సహకరించిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ నిర్ణయంపై మళ్లీ వెనక్కి వెళ్లకుండా రాజధానులు మూడు కాదు రెండు అని ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. గత ప్రభుత్వం ప్రకటించిన రాజధానిని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని