Raghurama: అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తా: ఎంపీ రఘురామ

కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేశారంటూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ ఛార్జీషీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన..

Updated : 01 Jan 2022 09:11 IST

దిల్లీ: కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేశారంటూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ ఛార్జీషీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రేపో, మాపో జైలుకు వెళ్లే వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఈ ఛార్జిషీట్‌ ఇప్పుడే నమోదు కావడం కూడా చాలా శుభపరిణామమని రఘురామ చెప్పారు. అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తామని ఆయన వెల్లడించారు. కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో రఘురామకృష్ణరాజుతోపాటు ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీలు, గుత్తేదారులు, ఛార్టెడ్‌ అకౌంటెంట్లతో కలిపి 16 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసినట్లు సీబీఐ ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని