Raghurama: అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తా: ఎంపీ రఘురామ
కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేశారంటూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన..
దిల్లీ: కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేశారంటూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రేపో, మాపో జైలుకు వెళ్లే వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఈ ఛార్జిషీట్ ఇప్పుడే నమోదు కావడం కూడా చాలా శుభపరిణామమని రఘురామ చెప్పారు. అన్ని అంశాలపై కోర్టుకు సమాధానం ఇస్తామని ఆయన వెల్లడించారు. కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో రఘురామకృష్ణరాజుతోపాటు ఆయన కంపెనీ, అనుబంధ కంపెనీలు, గుత్తేదారులు, ఛార్టెడ్ అకౌంటెంట్లతో కలిపి 16 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసినట్లు సీబీఐ ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.