AP News: చంద్రబాబు సంగతి తెలిసే అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు: విజయసాయి

తెదేపా అధినేత చంద్రబాబు సంగతి తెలిసే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యా్ఖ్యానించారు..

Updated : 27 Oct 2021 13:04 IST

దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు సంగతి తెలిసే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు దిల్లీ పర్యటనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘‘చంద్రబాబు ఎందుకు దిల్లీ వచ్చారో చెప్పాలి. దిల్లీలో వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు వచ్చారా?ఏపీ పరువు తీసేందుకే దిల్లీ వచ్చారా?పట్టాభి తిట్లను సమర్థిస్తున్నారా?ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు లేవు. చంద్రబాబే ఒక ఉగ్రవాది. దిల్లీలో ఆయనకు ఎవరూ సమయం ఇవ్వట్లేదు’’ అని విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని.. ఏక కాలంలో తెదేపా కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారని చంద్రబాబు ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని