సీఎం చూసుకోమన్నందుకే ఉత్తరాంధ్ర జిల్లాలపై దృష్టి: విజయసాయిరెడ్డి
డబ్బు, భూముల కొనుగోలు, భూ ఆక్రమణలపై తనకు ఆసక్తి లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
విశాఖ: డబ్బు, భూముల కొనుగోలు, భూ ఆక్రమణలపై తనకు ఆసక్తి లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. భూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని ప్రతిపక్షాలు తనపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విశాఖలోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘‘ఉత్తరాంధ్ర జిల్లాలను సీఎం చూసుకోమన్నందునే దృష్టిపెట్టా. నా పేరున ఇప్పటి వరకు విశాఖలో స్థలాలు, భూములు లేవు. భవిష్యత్తులో విశాఖలో స్థిరపడాలనుకుంటున్నా.
నా పేరు చెప్పి భూ ఆక్రమణలకు పాల్పడితే టోల్ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి. త్వరలో రెండు టోల్ఫ్రీ నెంబర్లు ఇస్తా.. ఫోన్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. అధికారంలో ఉన్నాం.. ఎవరు ప్రశ్నించరనుకుంటే ప్రజలు హర్షించరు. ప్రజాభీష్టం మేరకు పాలన చేయాలని మేయర్, కార్పొరేటర్కు చెబుతున్నా’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం