YS Sharmila: షర్మిల ‘రైతు వేదన’ దీక్ష ప్రారంభం

తెలంగాణ రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నగరంలోని

Updated : 24 Sep 2022 15:07 IST

హైదరాబాద్‌: తెలంగాణ రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నగరంలోని ఇందిరాపార్కు వద్ద దీక్ష ప్రారంభించారు. ‘రైతు వేదన’ పేరుతో చేపట్టిన ఈ దీక్ష 72గంటల పాటు కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పోలీసులు దీక్షకు అనుమతివ్వని కారణంతో ఇందిరా పార్కు వద్ద ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించి అనంతరం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మిగిలిన దీక్షను పూర్తి చేస్తారని ఆ పార్టీ నాయకులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని షర్మిల ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని