YS Sharmila: వైఎస్‌ఆర్ సంక్షేమ పాలనే లక్ష్యంగా పాదయాత్ర: షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన లేదని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ సమాధి

Updated : 19 Oct 2021 16:56 IST

కడప‌: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన లేదని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు. రేపు చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ‘‘తెలంగాణలోని ప్రతి పల్లెకు పోతాం.. ప్రతి గడపను తడతాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజలంతా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను’’ అని షర్మిల పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని