మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఫిక్స్‌డ్‌ రేట్ల ఎమ్మెల్యే: వైకాపా నేత తీవ్ర ఆరోపణలు 

నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై అదే పార్టీకి చెందిన నేత చేజర్ల సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

Updated : 18 Oct 2021 14:44 IST

నెల్లూరు: ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై అదే పార్టీకి చెందిన నేత చేజర్ల సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌ ఆశయాలకు ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రతి పనికీ ఎమ్మెల్యే కమీషన్లు వసూలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. 

‘‘అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి మండల కన్వీనర్ల వరకు అమ్మకాలు చేపట్టారు. వింజమూరు మండల కన్వీనర్లను ఆరునెలల్లో మూడుసార్లు మార్చారు. వరికుంటపాడు ఎంపీపీ పదవిని అమ్ముకున్నారు. జడ్పీటీసీ టికెట్‌ కోసం రూ.50లక్షలు ఇచ్చాం. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఫిక్స్‌డ్‌ రేట్ల ఎమ్మెల్యేగా మారిపోయారు. 8 మంది దళారులను ఏర్పాటు చేసుకుని దందాలు సాగిస్తున్నారు’’ అని సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో జడ్పీటీసీ రామాంజనేయులు, నేతలు సోమిరెడ్డి, శ్రీనివాస్‌, రవీందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని