AP News: నా ట్రాక్టర్‌నే సీజ్‌ చేస్తారా?: పోలీస్‌స్టేషన్‌లో వైకాపా నేత వీరంగం

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నందుకు వైకాపా నాయకుడు పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో వీరంగం సృష్టించాడు...

Updated : 22 Dec 2021 11:40 IST

 

అమరావతి: ఇసుక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నందుకు వైకాపా నాయకుడు పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో వీరంగం సృష్టించాడు. గతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గుంటూరు జిల్లా అమరావతి వాసి లక్ష్మీనారాయణకు చెందిన ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీలో ఉన్న తన వాహనాన్నే సీజ్‌ చేస్తారా అంటూ లక్ష్మీనారాయణ హల్‌చల్‌ చేశాడు. మద్యం మత్తులో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నేలపై దొర్లుతూ హంగామా సృష్టించాడు. పోలీసులు తనను అనుమానించారని.. దీనికంటే చనిపోవడమే మేలంటూ కేకలు వేశాడు. పోలీసులు సముదాయించినా వినిపించుకోకుండా వారిపై దూషణలకు దిగాడు. ఈ ఘటన జరిగి నెలరోజులు గడిచినట్లు పోలీసులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని