Ap News: సొంత పార్టీ నేతనే విమర్శిస్తావా.. ఎవరు చెబితే చేశావంటూ వైకాపా నేతపై దాడి
ఒంగోలుకు చెందిన వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాపై గుంటూరులో అదే పార్టీకి చెందిన కొందరు పార్టీ శ్రేణులు దాడి చేశారు. ఇటీవల వైకాపాలో కొందరి తీరుపై సుబ్బారావు
ప్రకాశం: ఒంగోలుకు చెందిన వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాపై గుంటూరులో అదే పార్టీకి చెందిన కొందరు పార్టీ శ్రేణులు దాడి చేశారు. ఇటీవల వైకాపాలో కొందరి తీరుపై సుబ్బారావు గుప్తా విమర్శలు చేసిన నేపథ్యంలోనే ఆయనపై ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతనే విమర్శించాడని వైకాపా శ్రేణులు దాడికి దిగారు. వైకాపా నేతల వైఖరిని విమర్శించిన సుబ్బారావు గుప్తా ఇంటిపై మొన్న రాత్రి వైకాపా శ్రేణులు దాడి చేశారు. దాడి అనంతరం తప్పించుకొని వెళ్లిన సుబ్బారావు.. గంటూరులోని లాడ్జిలో దాక్కున్నాడు. అతని సమాచారం తెలుసుకున్న వైకాపా కార్యకర్త సుభాని, మరికొందరు పార్టీ శ్రేణులు.. మంత్రి బాలినేనినే విమర్శిస్తావా అంటూ లాడ్జికి వెళ్లి సుబ్బారావును కొట్టాడు. ఎవరు చెబితే విమర్శలు చేశావని ప్రశ్నిస్తూనే కొట్టారు. అంతటితో ఆకుండా మోకాళ్లపై కూర్చొబెట్టి, క్షమాపణ చెప్పించి వీడియో తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దాడులు చేయడం మా సంస్కృతి కాదు: బాలినేని
వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనపై మంత్రి బాలినేని స్పందిస్తూ.. ‘‘గుప్తాపై దాడి జరుగుతోందని తెలిసి మా వాళ్లను ఆగమని చెప్పాను. నా గురించి ఒంగోలు ప్రజలకు తెలుసు. దాడులు చేయడం మా సంస్కృతి కాదు. మతిస్థిమితం లేకే గుప్తా సభలో అలా మాట్లాడారు. సుబ్బారావు గుప్తాను కొడుతున్నారని తెలిసి వెంటనే ఫోన్ చేసి ఆపా. ఒంగోలులో తెదేపా నేతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. వివిధ పార్టీల జెండాలను గుప్తా అమ్ముతంటారు. గుప్తాకు నాతో ఎక్కువ పరిచయం ఉన్న మాట వాస్తవమే’’ అని మంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్