Andhra News: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్తత

మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోసారి భారీగా పోలీసులు మోహరించారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఇప్పటికే నర్సీపట్నం చేరుకున్నాయి.

Published : 24 Feb 2022 01:35 IST

నర్సీపట్నం: మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోసారి భారీగా పోలీసులు మోహరించారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఇప్పటికే నర్సీపట్నం చేరుకున్నాయి. ఏ సమయంలోనైనా అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అరెస్టును అడ్డుకునేందుకు అయ్యన్న ఇంటి వద్దకు తెదేపా శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన ఓ సమావేశంలో అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ కేసుకు సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని నల్లజర్ల పోలీసులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని