Andhra News: ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్లు... తెదేపా అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉండవల్లి కరకట్ట సమీపంలో నిర్మించిన ప్రజావేదికను
అమరావతి: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉండవల్లి కరకట్ట సమీపంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చేసి నేటికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా తెదేపా శ్రేణులు నిరసన తెలుపుతారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు ప్రజావేదిక లో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన సీఎం జగన్... అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అదే రోజు రాత్రి కూల్చివేత పనులు చేపట్టారు. అప్పటి నుంచి ఏటా ఇదే రోజు తెదేపా శ్రేణులు ప్రజావేదిక కూల్చివేసిన ప్రాంతంలోని శిథిలాల వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ ఏడాది కూడా తెదేపా శ్రేణులు నిరసన తెలిపేందుకు సమాయత్తమవుతుండటంతో పోలీసులు అప్రమత్తమై చంద్రబాబు ఇంటి వద్ద భారీగా మోహరించారు.
చంద్రబాబు నివాసానికి వెళ్లే మూడు మార్గాలను బారికేడ్లు, ముళ్లకంచెలతో మూసివేశారు. కొండవీటి వాగువైపు, ఉండవల్లి గుహల వైపు, సచివాలయం నుంచి విజయవాడవైపు వచ్చే మూడు దారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ముళ్లకంచెల, బారికేడ్లతో దిగ్బంధించారు. సామాన్య ప్రజలు సైతం ఇటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. తమ పొలాల వద్దకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపైనే బైఠాయించిన తెదేపా నేతలు
ప్రజావేదిక శిథిలాల వద్దకు వెళ్లేందుకు తెదేపా శ్రేణులు ప్రయత్నించడంతో ఉండవల్లి గుహల వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా నేతలు నక్కా ఆనందబాబు, సత్యనారాయణరాజు, పట్టాభిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రజా వేదిక కూల్చి మూడేళ్లైన నేపథ్యంలో శిథిలాల వద్ద నిరసన తెలిపేందుకు తెదేపా నేతలు ప్రయత్నించారు. ముందే ఈ విషయాన్ని గ్రహించిన పోలీసులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM