Shashi Tharoor: నా బలమెంటో.. ఆ రోజు చూస్తారు..!
శతాధిక పార్టీ కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అధ్యక్ష బరిలో కీలకంగా ఉన్నారు.
పాలక్కాడ్: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అధ్యక్ష బరిలో కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలో పాల్గొనడంపై దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తల నుంచి తనకు మద్దతు ఉందని వెల్లడించారు. నామినేషన్ రోజున తన బలమేంటో తెలుస్తుందన్నారు.
‘నేను నామినేషన్ వేసే సమయంలో.. నా బలమేంటో మీరు చూస్తారు. మెజార్టీ రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభిస్తేనే.. నేను పోటీలో ఉంటాను. అధ్యక్ష ఎన్నికలో బరిలో ఉండమని నన్ను ఎంతోమంది అభ్యర్థించారు. ప్రస్తుతం నేను నామినేషన్ పత్రాన్ని పొందాను. నేతలను కలుస్తూ, వారితో మాట్లాడుతున్నాను. ఈ పోటీ గురించి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతో చర్చించాను. దీంతో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు నేరుగా వెల్లడించారు’ అని థరూర్ పేర్కొన్నారు.
అధ్యక్ష పదవి పోటీ గురించి ఇదివరకే థరూర్.. సోనియాను కలిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో దిగేందుకు తాను సిద్ధమైనట్టు సోనియాకు చెప్పగా.. అందుకు ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ ఎన్నిక నిమిత్తం ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అక్టోబరు 1న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణకు అక్టోబరు 8 వరకు గడువు ఇచ్చారు. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులుంటే అక్టోబరు 17న ఓటింగ్ నిర్వహించనున్నారు. 19న ఫలితాలను వెల్లడిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు