AP news: బుచ్చయ్య చౌదరితో పార్టీ నేతల మంతనాలు
ఆంధ్రప్రదేశ్లో తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో.. తెదేపా...
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్లో తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో.. తెదేపా నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని గోరంట్ల నివాసానికి పార్టీ త్రిసభ్య బృందం చేరుకుంది. బృందంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్ ఉన్నారు. గోరంట్ల డిమాండ్లను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు.గోరంట్ల రాజీనామా చేస్తారనే ప్రచారం గురువారం విస్తృతంగా సాగిన విషయం తెలిసిందే. సీనియర్గా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, పార్టీలో సమస్యలపై సూచనలు పాటించకపోవడం.. బుచ్చయ్య సూచించిన వారికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి తాజా పరిణామాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. త్వరలో జరగనున్న రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో ఫోన్లో మాట్లాడేందుకు గోరంట్ల ప్రయత్నించి భంగపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో ఫోన్లో బుచ్చయ్యతో మాట్లాడించారు. ఏమైనా సమస్యలుంటే కూర్చుని మాట్లాడదామని వాళ్లు చెప్పడంతో సమస్య సద్దుమణిగినట్లయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మునుపెన్నడూ లేనంత తక్కువగా.. 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ..
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్.. మునుపెన్నడూ లేనంత తక్కువగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. -
రాష్ట్రానికి విజనరీ కావాలా.. ప్రిజనరీ కావాలా?
ధర్మానికి, అధర్మానికి; న్యాయానికి, అన్యాయానికి; నీతికి, అవినీతికి; టూరిజానికి, శాడిజానికి; విజనరీకి, ప్రిజనరీకి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలంగాణ తెదేపా నేత నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
త్రిమూర్తులుపై వేటా.. సీటా..?
దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఇప్పుడు మండపేట నియోజకవర్గ అభ్యర్థిగా వైకాపా తప్పిస్తుందా..? లేదా ఎమ్మెల్సీ అనంతబాబులాగే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. -
ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయం
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతోందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తంచేశారు. -
మంత్రి పెద్దిరెడ్డిది అవినీతి సామ్రాజ్యం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ల్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
నాకే పాపం తెలియదు
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిడు, కడప: వివేకా హత్య కేసులో తనకెలాంటి ప్రమేయం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పునరుద్ఘాటించారు. -
175కు 175 స్థానాలూ ఇవ్వండి
‘రాష్ట్రంలో 58 నెలల మా పాలనా కాలంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు, నాలుగు సీ పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయాలు ప్రారంభించి పనులు చేయిస్తున్నాం. -
గొడ్డలిని వదిలేసి గులకరాయి వాడినందుకే కథ అడ్డం తిరిగింది
వైకాపా ట్రేడ్మార్క్ గొడ్డలిని వదిలేసి గులకరాయిని వాడినందుకే కథ అడ్డం తిరిగిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. -
సీఎంపై రాయి దాడి ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోండి
ముఖ్యమంత్రిపై జరిగిన రాయి దాడి ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. -
అభివృద్ధి వికేంద్రీకరణ.. అమరావతిలో రాజధాని
ప్రజల ఎజెండా కోసమే సీపీఎం పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. -
దళితుల ఆశీస్సులున్నంత వరకూ.. ఏ కటకటాలూ ఆపలేవు..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో దళితుల ఆశీస్సులు ఉన్నంతవరకూ తనను ఏ కటకటాలూ ఆపలేవని, ఎవరూ ఏమీ చేయలేరని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. -
కోడ్ ఉండగా వైకాపా వాళ్లు ధర్నాలెలా చేస్తారు?
సీఎం జగన్పై రాయితో దాడి జరిగిన రోజున వైకాపా వాళ్లు రహదారులపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని తెదేపా నేతలు తెలిపారు. -
తోట త్రిమూర్తులును వైకాపా నుంచి బహిష్కరించాలి
దళితులపై ఏమాత్రం గౌరవమున్నా శిరోముండనం కేసులో 18 నెలల శిక్ష పడిన తోట త్రిమూర్తులును వైకాపా నుంచి బహిష్కరించాలని తెదేపా మాజీ మంత్రి కేఎస్ జవహర్ డిమాండు చేశారు. -
గ్రంధి శీనన్న లోకల్ హీరో అట!.. కారుమూరి మనసు వెన్నట!
మమకారం పంచే గోదావరి జిల్లాలు.. వెటకారానికీ పెట్టింది పేరు. ‘అయ్యబాబోయ్...చాలా గొప్పోరు అండి మీరు’ అంటే అందులో చాలా వెటకారం ధ్వనిస్తుంది. -
ఆ 8 మంది అధికారులను ఏపీ నుంచి తప్పించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరగడానికి 8 మంది అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. -
జే గ్యాంగ్ బెదిరింపులతోనే అరబిందో ఇన్ఫ్రాకు కాకినాడ పోర్టు
దేశంలో ఎక్కడా పోర్టులు నిర్మించిన, నిర్వహించిన అనుభవం లేని.. కనీసం పోర్టు గోడలకు రంగులు కూడా వేయని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన అరబిందో ఇన్ఫ్రాకు అత్యంత కీలకమైన కాకినాడ పోర్టును ఎలా కట్టబెట్టారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. -
ఎన్డీయే ప్రచారానికి ఎన్నారైలు సిద్ధం
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కమిటీల్లోనూ ప్రవాసాంధ్రులకు సముచిత స్థానం కల్పిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్ వెల్లడించారు. -
రాష్ట్రానికి మరోసారి ప్రధాని మోదీ రాక
రాష్ట్రంలో నిర్వహించబోయే ఎన్డీయే ప్రచార సభల్లో ప్రధాని మోదీతోపాటు భాజపా జాతీయ సీనియర్ నేతలు పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు. -
ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు నిలిపివేయాలి
ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ నెల 23న సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జారీచేసిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ.. ఎన్నికల ప్రధాన కమిషనర్ ముకేశ్కుమార్ మీనాకు మంగళవారం భాజపా రాష్ట్ర శాఖ వినతిపత్రం అందజేసింది. -
గాజు గ్లాసు గుర్తు జనసేనదే
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. -
మైనారిటీల మమత!
హోరాహోరీ పోరు నెలకొన్న పశ్చిమ బెంగాల్లో ప్రతి ఓటూ కీలకంగానే భావించి తృణమూల్ కాంగ్రెస్, భాజపా పోరాడుతున్నాయి. దీంతో ఏయే వర్గాల ఓట్లు ఎటు పడతాయన్న ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
బామ్మ చూపిన బంగారు బాట
-
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
-
జగనాసురుల కన్ను పడితే.. జగద్రక్షకుడి ఆస్తులు గోవిందా..
-
సమావేశానికి రాలేదని తెదేపా కార్యకర్త ఇంటిపై వైకాపా కార్యకర్తల దాడి
-
ఒకే రాయి ఇద్దరికి ఎలా తగిలింది?: ఎంపీ రఘురామ
-
మునుపెన్నడూ లేనంత తక్కువగా.. 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ..