కాలం సీఎంని చేస్తే.. దురదృష్టం దించేసింది..!
కాలం కలిసొచ్చింది.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. కానీ ఆయనకు అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. కొంత దురదృష్టం.. మరికొంత స్వయంకృతాపరాధం.. వెరసి నాలుగు నెలలు తిరగకుండానే
సీఎంగా తీరథ్ సింగ్.. 115 రోజుల కష్టాలు
ఇంటర్నెట్డెస్క్: కాలం కలిసొచ్చింది.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. కానీ ఆయనకు అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. కరోనా రూపంలో వచ్చిన కొంత దురదృష్టం.. మరికొంత స్వయంకృతాపరాధం.. వెరసి నాలుగు నెలలు తిరగకుండానే ఆయన కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది..! 115 రోజుల అతితక్కువ పదవీకాలం.. సీఎంగా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ ప్రయాణం.. అంతా కష్టాలమయమే!!
అధికారిక నివాసంలో ఉండలేదు.. అసెంబ్లీకి వెళ్లలేదు
పార్టీలో తీవ్ర అసమ్మతి కారణంగా త్రివేంద్ర సింగ్ రావత్ ఈ ఏడాది మార్చిలో ఉత్తరాఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అదే నెల 10న నూతన ముఖ్యమంత్రిగా తీరథ్సింగ్ ప్రమాణం చేశారు. అదే సమయంలో కరోనా రెండో దశ ఉద్ధృతి మొదలవడంతో డెహ్రాడూన్లోని ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం కొవిడ్ కేర్ సెంటర్గా పనిచేస్తుందని తీరథ్ ప్రకటించారు. దీంతో ఆయన తన వ్యక్తిగత నివాసంలోనే ఉంటూ సీఎం బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మరికొన్ని రోజుల్లో సీఎం అధికారిక నివాసానికి మారాలని అనుకున్నారు. అయితే ఈలోగానే అనూహ్యంగా రాజకీయాలు మలుపు తిరగడం.. ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగకపోవడం గమనార్హం.
ఉపఎన్నికల ఆశలపై ‘కరోనా’ నీళ్లు..
తీరథ్ సింగ్ రావత్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. సీఎం పీఠంపై కొనసాగాలంటే సెప్టెంబరు 10లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాలి. నిజానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే ఆయన ఉపఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండగా.. కరోనా ఆయన ఆశలపై దెబ్బకొట్టింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 12 రోజుల తర్వాత మే 22న తీరథ్ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిన మరుసటి రోజే అంటే మే 23న ఉత్తరాఖండ్లో ఖాళీగా ఉన్న సాల్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ వేయడానికి మే 30 వరకు గడువు కల్పించింది. అయితే ఐసోలేషన్ కారణంగా తీరథ్ నామినేషన్ వేయలేకపోయారు. దీంతో భాజపా మరో అభ్యర్థిని నిలబెట్టింది. ఏప్రిల్ 17న జరిగిన ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది. అయితే ఏప్రిల్ 4నే తీరథ్కు నెగెటివ్ వచ్చింది. కరోనా వల్లే తాను ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదని తీరథ్ ఆ తర్వాత మీడియాకు చెప్పారు.
ఇక ఏప్రిల్, జూన్ నెలల్లో గంగోత్రి, హల్ద్వానీ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిల్లో ఒక దాన్నుంచి తీరథ్ ఉప ఎన్నికల బరిలో దిగుతారని తొలుత అంచనాలు వెలువడ్డాయి. అయితే ఆయన ఆశలపై ఈసారి ఈసీ నీళ్లు చల్లింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మార్చితోనే ముగియనుండటం, కొవిడ్ మహమ్మారి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడంతో ఎన్నికల సంఘం (ఈసీ) ఉప ఎన్నికల జోలికి వెళ్లడం లేదు. దీంతో సీఎం పదవిలో కొనసాగేందుకు ఆయనకు అవకాశాలు మరింత సన్నగిల్లాయి.
నోరు జారే.. ‘కుర్చీ’ పాయే..
నిజానికి అప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు తీరథ్కు ఒక అవకాశం ఉంది. తీరథ్తో రాజీనామా చేయించి.. తిరిగి ఒకరోజు తర్వాత మళ్లీ సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశం భాజపాకు ఉంది. ఇలా జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అయితే సీఎం అయ్యాక పలు వివాదాస్పద వ్యాఖ్యలతో భాజపా అధిష్ఠానానికి తీరథ్ తలనొప్పులు తెచ్చిపెట్టారు. మహిళల రిప్డ్ జీన్స్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ప్రధాని మోదీని రాముడు, కృష్ణుడి అవతారంగా పేర్కొనడం, ఉచిత రేషన్ కావాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని చెప్పడం వంటివి వివాదాస్పదమయ్యాయి. అంతేగాక, పార్టీ నేతల్లో అంతర్గత విభేదాలనూ పరిష్కరించలేకపోయారు. ఆయన హయాంలో కుంభమేళా నిర్వహణ తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎంను మార్చేందుకే అధిష్ఠానం మొగ్గుచూపింది!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: రేవంత్
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: రేవంత్
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు