Shiv Sena: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ అలజడి..ఆసక్తి రేపుతున్న శివసేన నేతల వ్యాఖ్యలు!
మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ అలజడి మొదలవుతోంది. శిందే నేతృత్వంలోని శివసేన నాయకులపై భాజపా సవతితల్లి ప్రేమ కనబరుస్తోందని ఠాక్రే వర్గీయులు చెబుతున్నారు. భాజపా ప్రేమను తట్టుకోలేక 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన అధికార పత్రిక సామ్నాలో రాసుకొచ్చారు.
ముంబయి: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే (Eknath Shinde) వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై భాజపా (ñBJP) సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) ఎద్దేవా చేసింది. ఆ ప్రేమతో ఉక్కిరిబిక్కిరైన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తన అధికార పత్రిక సామ్నా పేర్కొంది. శిందే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు భాజపా దృష్టిలో కోళ్లలాంటి వారని, ఎప్పటి వరకు పెంచుకుంటారో? చెప్పలేమని పేర్కొంది. 2019లో పూర్వపు శివసేన భాజపాతో సంబంధాలు తెంచుకున్న సమయంలోనూ సామ్నా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఠాక్రేలను మోసం చేసిన శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు భాజపాతో చేతులు కలిపారని, మోజు తీరిపోవడంతో ఇప్పుడు విడాకుల చర్చలు మొదలయ్యాయని సంపాదకీయంలో రాసుకొచ్చింది. ఇటీవల శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భాజపా తమపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని వ్యాఖ్యానించడం సామ్నా కథనానికి మరింత ఊతమిస్తోంది. ‘‘ మేము ఎన్డీయే ప్రభుత్వంలో భాగమే. మా పని తీరుకు గుర్తింపు కూడా అలాగే ఉండాలి. భాజపా నేతలతో పోల్చుకున్నప్పుడు తేడా కనిపించకూడదు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. మా నేతలు సవతితల్లి ప్రేమను పొందుతున్నారు.’’ అని గజానన్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలను ఠాక్రే వర్గం అస్త్రాలుగా మలుచుకుంది. పార్టీని రూపుమాపేందుకు భాజపా ప్రయత్నిస్తోందని శివసేన గుర్తించిందని, అందుకే ఈ మధ్య కాలంతో దూరం పాటిస్తోందని సామ్నా పత్రిక ఎడిటర్, ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘‘భాజపా ఓ అనకొండలాంటిది. దాని దగ్గరికి ఎవరు వెళ్లినా మింగేస్తుంది. శివసేన నాయకులకు ఇప్పుడది అర్థమవుతోంది. గతంలో ఆ పార్టీని ఎందుకు దూరం పెట్టామో తెలుస్తోంది.’’ అని సంజయ్రౌత్ తెలిపారు.
2019లో తన చిరకాల మిత్రపార్టీ భాజపాతో శివసేన పొత్తును రద్దు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడీని ఏర్పాటు చేసింది. అయితే, శిందే రూపంలో సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో గత ఏడాదే శివసేన రెండుగా విడిపోయింది. తీవ్ర చర్చోపచర్చలు, న్యాయస్థానాల జోక్యం తర్వాత శిందే వర్గానిదే అసలైన శివసేన అని ఎన్నికల సంఘం గుర్తించింది. ఠాక్రే వర్గానికి ప్రత్యేక పేరు, పార్టీ గుర్తులను కేటాయించింది. తాజాగా శిందే వర్గానికి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో మహారాష్ట్రలో మరోసారి రాజకీయ అలజడి మొదలైనట్టయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా