Gujarat polls: 89 స్థానాలు.. 788మంది అభ్యర్థులు.. ఆ సీటులో 44మంది పోటీ!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు(Gujarat Assembly polls2022) ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు (Gujarat Assembly polls2022) ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈసారి జరుగుతున్న త్రిముఖ సమరంలో తలపడేందుకు ఆయా రాజకీయ పార్టీలు తమ గెలుపు గుర్రాల్ని బరిలో దించాయి. తొలి విడతలో 89 స్థానాలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుండగా.. అందుకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో తొలి విడత పోరులో 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు గుజరాత్ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వెల్లడించింది. వీరిలో 70మంది మహిళలే ఉన్నట్టు పేర్కొంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ విడతలో పోటీకు మొత్తంగా 39 పార్టీల నుంచి అభ్యర్థులతో పాటు 399 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నట్టు తెలిపారు. సూరత్ జిల్లాలోని లింబయత్ స్థానానికి మొత్తం 44 మంది అభ్యర్థులు పోటీలో నిలబడుతుండటంతో అక్కడ పోలింగ్కు మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. అలాగే, మోర్బినియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో రెండు యూనిట్లను ఉపయోగిస్తున్నారు.
అధికార భాజపా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అన్ని స్థానాలనుంచి తమ అభ్యర్థుల్ని బరిలో దించగా.. ఆప్ 88 మంది అభ్యర్థులను పోటీలో ఉంచింది. అలాగే, బీఎస్పీ నుంచి 57 మంది ఏఐఎంఐఎం నుంచి ఆరుగురు పోటీలో ఉన్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. తొలుత 89 స్థానాలకు మొత్తంగా 1362 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ పత్రాల పరిశీలన (నవంబర్ 15) నాటికి ఆ సంఖ్య 999కి పడిపోయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు (నవంబర్ 17) ముగిసే నాటికి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 788గా ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు, డిసెంబర్ 5న 93 సీట్లకు జరిగే రెండో విడత ఎన్నికల్లో ఇప్పటివరకు 1515 నామినేషన్లు దాఖలైనట్టు తెలిపారు. రెండో విడత ఎన్నికల నామినేషన్ పత్రాల ఉపసంహరణకు ఆఖరి గడువు నవంబర్ 21తో ముగియనుందని చెప్పారు. గుజరాత్లో మొత్తంగా 182 సీట్లకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?