ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచారకర్తలు వీళ్లే
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రచార, సమన్వయకర్తలను నియమించింది...
హైదరాబాద్: త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రచార, సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారకర్తగా ఎంపీ రేవంత్రెడ్డి, సమన్వయకర్తగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్.. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానానికి ప్రచారకర్తగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సమన్వయకర్తగా కాంగ్రెస్ ఆదివాసీ కమిటీ జాతీయ వైస్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ను నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.