Revanth Reddy: మానవత్వం లేకుండా వెంకట్పై పోలీసులు దాడి చేశారు: రేవంత్రెడ్డి
ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో కాలుషితాహారం తిని 128 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఎన్ఎస్యూఐ నేతలు విద్యార్థులను పరామర్శించేందుకు సిద్దిపేటలకు బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు అస్వస్థతకు గురైతే వారిని పరామర్శించడానికి వెళ్తున్న విద్యార్థి నాయకుడిని అడ్డుకోవడం తెరాస పాలకుల పాశవికత్వం అని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతోందని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు స్పందించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అణచివేస్తున్నారన్నారు. మానవత్వం లేకుండా వెంకట్ పైన పోలీసుల దాడి చేశారన్నారు. పాలకులు ఇలాగే పాశవికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెపుతామన్నారు. తెరాస పాలకులకు రోజులు దగ్గర పడ్డాయని రేవంత్రెడ్డి అన్నారు. ఈ ఘటనలో వెంకట్ గాయపడడంతో కాంగ్రెస్ నాయకులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రేవంత్రెడ్డి సిద్దిపేట పోలీస్ కమీషనర్తో ఫోన్లో మాట్లాడారు.
ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్పై పోలీసుల అరాచకం నియంతృత్వ పోకడకు నిదర్శనమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి విమర్శించారు. పోలీసుల దాడిలో సృహ తప్పిపోయిన వెంకట్కు ఎలాంటి సమస్య ఎదురైనా తెరాస ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, నియంత పోకడలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెపుతారని మల్లురవి హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం