Revanth Reddy: రాజీపడటం నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు: రేవంత్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా తన కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుందని అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్తో లాలూచీ తన రక్తంలోనే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తుదిశ్వాస విడిచే వరకు కేసీఆర్తో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారంటూ భాజపా నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడాన్ని రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేశారు. ‘ఒక వేళ మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. నా కుటుంబం మొత్తం సర్వనాశనమైపోతుంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. భారాస, భాజపాలు భారీగా డబ్బులతో బరిలోకి దిగితే.. కాంగ్రెస్ మాత్రం నిజాయితీగా పని చేసే అభ్యర్థి పాల్వాయి స్రవంతిని పోటీలో నిలిపిందని గుర్తు చేశారు. ‘‘ మునుగోడు ఉపఎన్నిక కోసం భారాస, భాజపా భారీగా డబ్బులు ఖర్చు చేశాయి. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అమ్ముడు పోయిందని ఈటల ఆరోపించారు. కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీ, పాల్వాయి స్రవంతి రూ.25 కోట్లు తీసుకున్నట్లు విమర్శించారు. నా నిజాయితీని శంకిస్తే మంచిది కాదు. నా కళ్లలో నీరు రప్పించావు. కేసీఆర్ సర్వం దారబోసినా రేవంత్ రెడ్డిని కొనలేరు. రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు.’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడటం అంటే ఇదేనా?
కేసీఆర్, కేటీఆర్ అవినీతిని బయటపెడితే తనను చర్లపల్లి జైల్లో బంధించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ కరుడుగట్టిన తీవ్రవాదులను ఉంచే గదిలో నిర్భందించారు. జైల్లో పెట్టి మనో ధైర్యాన్ని దెబ్బతీయాలని చూశారు. నోటీసులు ఇవ్వగానే లొంగిపోయినోడు కాదు ఈ రేవంత్రెడ్డి. రాజేంద్రా.. నువ్వు చేరిన పార్టీలో గుర్తింపు కోసం దిగజారుడు ఆరోపణలు చేస్తావా? ఈటల ఆరోపణలు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం. కేసీఆర్ దగ్గర రూ.25 కోట్లు తీసుకుంటే ఆయన కళ్లలోకి చూసే ధైర్యం ఉండేదా? ఇన్నాళ్లూ మీపై సానుభూతి ఉండేది. కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడటమంటే ఇదేనా?9 ఏళ్లు నిద్రలేని రాత్రులు గడిపా.. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి.. కేసీఆర్ను ఓడించడమే నా లక్ష్యం. అందుకోసం సర్వం పోయినా ఫర్వాలేదు’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
ఈటలకు కన్నీళ్ల విలువ తెలీదు
కేసీఆర్ దండుపాళ్యం ముఠాలు నా స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినా కొట్లాడుతూనే ఉంటానని రేవంత్ తెలిపారు. ‘‘ కేసీఆర్ ముసుగు వేసుకొని ఈటల రాజకీయాలు చేస్తున్నారు. ఈటల ఆరోపణ చౌకబారుగా ఉండొచ్చు.. కానీ, అది నా మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. నేను అమ్ముడుపోయి ఉంటే.. ప్రజల గుండెల్లో ఉండేవాడిని కాదు. ఈటలకు కన్నీళ్ల విలువ తెలియదు... మానవత్వం లేదు. ఎవరు గద్దెనెక్కుతారో.. ఎవరు గద్దె దిగుతారో కాలం నిర్ణయిస్తుంది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. అమ్మవారిని నమ్ముతాను కాబట్టే ప్రమాణం చేశానని, దేవుడిపై విశ్వాసం ఉంటే ఈటల తన మాటలను ఉపసంహరించుకోవాలని అన్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఈటల దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను విసిరిన సవాల్ మేరకు చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేశానన్న రేవంత్.. ఈటల తన ఆరోపణలను నిరూపించుకోవాలని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది.