డబ్బులు పంచుతున్నా పట్టించుకోవట్లేదు: రాజాసింగ్

ఓట్ల కోసం గత రాత్రి నుంచి తెరాస, ఎంఐఎం నేతలు డబ్బులు పంచుతున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. బహిరంగంగా పంచుతున్నా

Published : 30 Nov 2020 11:52 IST

హైదరాబాద్: ఓట్ల కోసం గత రాత్రి నుంచి తెరాస, ఎంఐఎం నేతలు డబ్బులు పంచుతున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. బహిరంగంగా పంచుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని, పైగా వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. భాజపా కార్యకర్తలపై లాఠీ చేస్తున్నారని చెబుతూ... మైలార్‌దేవ్‌పల్లితోపాటు పలు డివిజన్‌లలో ఇలాంటి దాడులు జరిగాయని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తెరాసకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈ భావిస్తోందని రాజాసింగ్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని