Telangana News: రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులు నామినేషన్‌

రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులు బండి పార్థసారథి రెడ్డి, డి.దామోదర్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాల భర్తీ కోసం అసెంబ్లీ

Published : 25 May 2022 19:52 IST

హైదరాబాద్: రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులు బండి పార్థసారథి రెడ్డి, డి.దామోదర్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాల భర్తీ కోసం అసెంబ్లీ కార్యాలయంలో ఇవాళ ఇద్దరూ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, గంగుల కమలాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈనెల 31 వరకు నామినేషన్ల గడవు ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత జూన్ 3న పార్థసారథి, దామోదర్ రావు ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. జూన్ 21న డీఎస్, లక్ష్మీకాంతరావు పదవీకాలం ముగిసిన తర్వాత... పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు వారి స్థానంలో బాధ్యతలు తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని