Munugode: కూసుకుంట్లకు మునుగోడు టికెట్‌ ఇస్తే ఓడిస్తాం: తెరాస అసమ్మతి నేతలు

ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో తెరాస నాయకుల మధ్య విభేదాలు చల్లారడంలేదు. నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యనేతలతో ఇటీవల మంత్రి జగదీశ్‌రెడ్డి

Updated : 13 Aug 2022 05:51 IST

హైదరాబాద్‌: ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో తెరాస నాయకుల మధ్య విభేదాలు చల్లారడంలేదు. నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యనేతలతో ఇటీవల మంత్రి జగదీశ్‌రెడ్డి సమావేశమై చర్చలు జరిపారు. ఎవరికి టికెట్‌ ఇచ్చినా అందరూ కలిసి పనిచేస్తారని ప్రకటించారు. దీంతో నాయకుల మధ్య విభేదాలు సద్దుమణిగాయని అంతా భావించారు. కానీ, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ తెరాస అసమ్మతి నేతలు ఇవాళ మరోసారి సమావేశమయ్యారు. దాదాపు 80మంది ప్రజాప్రతినిధులు చౌటుప్పల్‌లో సమావేశమై చర్చలు జరిపారు. తెరాస మునుగోడులో గెలవాలంటే కూసుకుంట్లకు టికెట్‌ ఇవ్వొద్దని మూకుమ్మడిగా తీర్మానం చేశారు. టికెట్‌ ఇస్తే ఓడిస్తామని అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. చౌటుప్పల్‌ ఎంపీపీ తాండూరి వెంకట్‌రెడ్డి, చౌటుప్పల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు