presidential Election: మమతా బెనర్జీ సమావేశానికి తెరాస దూరం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిల్లీలో బుధవారం నిర్వహించనున్న సమావేశానికి హాజరుకాకూడదని తెరాస నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిల్లీలో బుధవారం నిర్వహించనున్న సమావేశానికి హాజరుకాకూడదని తెరాస నిర్ణయం తీసుకుంది. పార్టీ తరఫున ప్రతినిధులు ఎవరూ హాజరుకాకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇదే విషయంపై ప్రగతిభవన్లో సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీని ఈ సమావేశానికి ఆహ్వానించడంపై తెరాస అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమవైఖరి తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. భాజపా, కాంగ్రెస్కు సమదూరం పాటించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే విపక్షాలు కసరత్తు చేపట్టాయి. మరోవైపు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ అడుగు ముందుకువేసి విపక్షాలతో భేటీకి నిర్ణయించారు. ఈ నెల 15న దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశం కావడానికి పలువురు విపక్షాల ముఖ్యమంత్రులు, పలు పార్టీలను ఆహ్వానించింది. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని 8 మంది ముఖ్యమంత్రులు, 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ సమావేశానికి వెళ్లాలా? వద్దా? అని పలువురు పార్టీ నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM