TRS: ‘బండి సంజయ్‌ గోబ్యాక్‌’.. యాదాద్రిలో నల్ల జెండాలతో తెరాస నిరసన

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ యాదాద్రి పర్యటనకు వ్యతిరేకంగా స్థానిక తెరాస శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి.

Updated : 28 Oct 2022 12:34 IST

యాదగిరిగుట్ట: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ యాదాద్రి పర్యటనకు వ్యతిరేకంగా స్థానిక తెరాస శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తమ నిజాయతీని నిరూపించుంటామని.. యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానంటూ గురువారం సవాల్‌ విసిరిన సంజయ్‌.. శుక్రవారం అక్కడికి బయల్దేరిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టలో తెరాస నేతలు, కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన చేపట్టారు. సంజయ్ యాదాద్రి పర్యటనను అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. మరోవైపు భాజపా శ్రేణులు సంజయ్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరు పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో యాదగిరిగుట్టలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసరాలతో పాటు యాదాద్రి వెళ్లే మార్గాల్లో మోహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని