TS News: తెరాస ‘విజయ గర్జన సభ’ వాయిదా

రంగల్‌లో ఈ నెల 15న జరగనున్న తెరాస విజయ గర్జన సభ వాయిదా పడింది. ఈ నెల 29న దీక్షా దివస్‌ రోజున విజయగర్జన సభ నిర్వహించాలని

Updated : 09 Aug 2022 12:29 IST

హైదరాబాద్‌: వరంగల్‌లో ఈ నెల 15న జరగనున్న తెరాస విజయ గర్జన సభ వాయిదా పడింది. ఈ నెల 29న దీక్షా దివస్‌ రోజున విజయగర్జన సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వరంగల్‌ జిల్లా తెరాస నేతల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సభ ఏర్పాట్లు ఈ నెల 29వ తేదీకి మార్చుకోవాలని ఆయన సూచించారు.  తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ల పండుగ సందర్భంగా వరంగల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ విజయ గర్జన సభ నిర్వహించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గతంలో కరీంనగర్‌లో జరిగిన సింహ గర్జన సభను మించి విజయవంతం చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని