Munugode bypoll result: మునుగోడు ఉప ఎన్నికలో తెరాస విజయకేతనం

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూసిన మునుగోడు ఉప ఎన్నికలో తెరాస సత్తా చాటింది. దాదాపు 10వేల ఓట్లకుపైగా మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు.

Updated : 06 Nov 2022 19:55 IST

మునుగోడు: తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూసిన మునుగోడు ఉప ఎన్నికలో తెరాస సత్తా చాటింది. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై దాదాపు  దాదాపు 10వేల ఓట్లకుపైగా మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. 2, 3 రౌండ్లు మినహాయిస్తే.. తొలి రౌండ్‌ నుంచి తెరాస అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శించారు. సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ మునుగోడులో డిపాజిట్‌ కోల్పోయింది. తెరాస ఘనవిజయం సాధించడంతో ఆపార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మునుగోడుతో పాటు తెలంగాణ భవన్‌ వద్ద తెరాస శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని