TS High Court: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ
‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసును సీబీఐకి అప్పగించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. సీబీఐతో గాని లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని, సిట్ దర్యాప్తుపై స్టే విధించాలన్న భాజపా అభ్యర్థనను తోసిపుచ్చింది. దర్యాప్తులో పురోగతిని ఈనెల 29న జస్టిస్ విజయసేన్రెడ్డి బెంచ్కు అందించాలని సిట్ను ఆదేశించింది. దర్యాప్తునకు సంబంధించిన విషయాలను రాజకీయ నాయకులకు, మీడియాకు, కార్యనిర్వాహక వ్యవస్థకు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ చేయొద్దని, ఒక వేళ అలా జరిగితే తగిన చర్యలు తీసుకొంటామని సీజే ధర్మాసనం తెలిపింది. సిట్ దర్యాప్తును జస్టిస్ విజయసేన్రెడ్డి పర్యవేక్షిస్తారని సీజే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.